12, అక్టోబర్ 2011, బుధవారం

మన కంటి చూపు బాగా ఉండాలంటే.....

చిన్నపిల్లలు,యువకులు, పెద్దలు ఇలా అందరూ ఎక్కువగా చదవడం వల్లగానీ,కంప్యూటర్ ముందు ఎక్కువ పని చేయడంవల్లగానీ మన కంటిచూపు మందగిస్తుంటుంది.షోడా బుడ్డి లాంటి కళ్ళద్దాలను పెట్టుకోవాల్సివస్తున్నది.ప్రస్తుతము కళ్ళజోళ్ళు లేనివారు సైతం కొద్దికాలానికల్లా వాటిని ధరించవలసి వస్తుంది.మనము తినే అహారంలో మన కళ్ళు బాగా పనిచేయడానికి కావాల్సిన పోషక విలవలు లేవు.మనము ఆ పోషకాలేమిటో తెలుసుకొని వాటిని కనీసం 2 నెలలు తీసుకుంటే సరిపోతుంది.ద్రుష్టి దోషం ఉండదు.అవి ఏవి అంటే 1) జీడీలు 2) కారెట్ దుంపలు 3)ఆకు కూరలు  ....నువ్వులుకలిసిన బెల్లపు ఉండలను జీడీలని కృష్ణాజిల్లాలో పిలుస్తారు.అవి ఇక్కడ కూడా (హైదరాబదులోకూడా) దొరుకుతాయి.వాటిని  పొద్దున సాయంకాలము చొప్పున ప్రతిరోజూ 2 తినాలి. కారెట్ దుంపలను  ప్రతిరోజూ  5 తినాలి. లేదా పొద్దున ,సాయంకాలము కారెట్ జ్యూస్ ను ప్రతిరోజూ 40 దినాలపాటు  తాగాలి.మరియు  తోటకూర, బచ్హలి ఆకు, పెరుగుతోటకూర,గోంగూర,మెంతికూర  ఇలాంటి ఆకు కూరలు  మన ఆహారంలో బాగా ఉండేట్టు చూసుకోవాలి.ఇలా ఈ మూడింటిని  పైన చెప్పినట్లుగా ప్రతిఒక్కరూ 2 నెలలపాటు తీసుకుంటే అప్పుడు మనకు కళ్ళజోళ్ళు ధరించవలసిన  దౌర్భాగ్యం రాదు. ఇప్పటికే కళ్ళజోళ్ళు పెట్టుకొంటున్నవారు ఇక వాటిని ధరించవలసిన అవసరం ఉండదు.ఈవిధంగా  మన అహారపు అలవాట్లను సరిచేసుకోనుటద్వారా మనము మన ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకోవచ్హును.